Thursday, August 1, 2013

Oka raju eduguru kodukulu

ఒక రాజు ఏడుగురు కొడుకులు

                       అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. తెచ్చిన చేపలిని యెండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. చేపను పట్టిన రజకుమారుడు చేపని చేప చేప ఎందుకు యెండలెదు అని అడిగాడు. చేప గడ్డిమెటు అడ్డమొచ్చింది అని బదులు చెప్పింది. రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు? అని అడిగాడు. గడ్డిమెటు అందీ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు? అని అడిగాడు. నన్ను రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు యెందుకు రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ ఆక్కడ పాప యెడుస్తొంది
రాజకుమారుడు పాపని పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ అని అడిగితే, పాప నన్ను చీమ కుట్టింది అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ
ఆప్పుదు చీమ అంది నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా అని


No comments:

Post a Comment